తెరాస మేనిఫెస్టో విడుదల చేయనున్న కెసిఆర్... ముహూర్తం ఉదయం గం. 10.30
, శుక్రవారం, 4 ఏప్రియల్ 2014 (10:31 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టోను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కెసిఆర్ విడుదల చేయనున్నారు. తెలంగాణ భవన్ లో తెరాస పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అన్ని అంశాలను క్రోడీకరించి మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు సమాచారం.ఈ మేనిఫెస్టోతో పాటు అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను కూడా విడుదల చేస్తారని అంటున్నారు. తొలి జాబితాలో మొత్తం 69 అభ్యర్ధుల పేర్లను ప్రకటించనున్నారనీ, అంతా సిట్టింగులే ఉండబోతున్నట్లు సమాచారం.