Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ సీఎం అయితే సీమాంధ్రలో సాయుధ పోరాటం... పవర్ స్టార్

Advertiesment
పవన్ కళ్యాణ్
, సోమవారం, 5 మే 2014 (15:43 IST)
WD
జగన్ మోహన్ రెడ్డి సీమాంధ్రకు ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తే సీమాంధ్ర భూములన్నీ మింగేస్తాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదన్నారు. కేవలం జనం చల్లగా ఉండాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ధ్యేయంతోనే నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమివేయాలని పిలుపునిచ్చారు.

జగన్ మోహన్ రెడ్డికి తనకు మధ్య వ్యక్తిగతమైన విరోధం ఏమీ లేదనీ, ఐతే జగన్ ముఖ్యమంత్రి అయితే దానివల్ల సీమాంధ్రలోని భూములన్నీ కొంతమంది గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణం వల్లనే జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండానే జగన్ వేలకోట్లు దోచుకున్నాడనీ, అదే ఇక పదవి కూడా చేతికి వస్తే ఇక రాష్ట్రం ఏమవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి దోపిడీదారుల వల్ల సాయుధ పోరాటాలు జరిగుతాయని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu