Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నికలు 2014: 'టి'లో పారుతున్న పచ్చనోట్లు... రూ. 4 కోట్లు పట్టివేత

Advertiesment
ఎన్నికలు
, శుక్రవారం, 28 మార్చి 2014 (20:43 IST)
FILE
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడిపోవడంతో ఇక పచ్చనోట్లు పరుగులెత్తుతున్నాయి. శుక్రవారంనాడు తెలంగాణ జిల్లాల్లో రూ. 4 కోట్లను తనిఖీల్లో పట్టుకున్నారు. మెదక్ జిల్లా పరిధిలోని నర్సాపూర్ చెక్ పోస్టు వద్ద 1.06 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా వరంగల్ జిల్లా ఖాజీపేట వద్ద ఓ వాహనంలో రూ. 3 కోట్ల నగదును తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. సొమ్ముకు సంబంధించి తగిన ఆధారాలు చూపనందున నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తమ్మీద ఎన్నికల వేళ కోట్లకొద్దీ ధనం బయటకు వస్తోంది. మరి ఇలా డబ్బులు వెదజల్లి ఓట్లను కొనుక్కునే రాజకీయ నాయకులు ఇక ప్రజలకు ఏం చేస్తారో...?

Share this Story:

Follow Webdunia telugu