Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళికి నాకు బహుమతులేమీ ఇవ్వొద్దు: ప్రధాని

Advertiesment
దీపావళి 2011
, శనివారం, 22 అక్టోబరు 2011 (13:29 IST)
FILE
దీపావళి పండుగ వస్తుందంటేనే నేతలకు ఆయా కంపెనీలు బహుమతులతో మోతెక్కిస్తాయి. గతానుభవాల దృష్ట్యానో మరి దేనివల్లనో కానీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయా కంపెనీలకు, వ్యక్తులకు ముందుగానే ఓ విజ్ఞప్తి చేశారు.

అదేమంటే.. దీపావళికి తనకు ఖరీదైన వస్తువులు, బహుమతులను ఎవరూ ఇవ్వద్దన్నది. ఇటువంటి బహుమతులను తనకు ఇచ్చేకంటే ప్రధానమంత్రి సహాయనిధికి అందజేయాలని సూచించారు. అలా చేస్తే పేదలకు అవి అందుతాయనీ, దానిద్వారా వారి జీవితాల్లో వెలుగురేఖలు ఉదయిస్తాయని అన్నారు.

ఐతే ప్రధానమంత్రి మాటను ఆయా కంపెనీలు, ప్రముఖ వ్యక్తులు పట్టించుని బహుమతులను ఇవ్వకుండా మిన్నకుంటాయా..? అన్నదే ప్రశ్న.

Share this Story:

Follow Webdunia telugu