Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి శుభాకాంక్షలు ఎలా చెప్పాలి?

Advertiesment
ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం వెండివెలుగుల దీపావళి
దీపావళికి సన్నిహితులకు శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలుసా? పిండివంటలతో పాటు శ్రీ లక్ష్మీ స్తోత్ర పుస్తకాలను కూడా అందజేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం మీ గృహంలో నివాసముంటుంది. అదే విధంగా మీరు అప్పుల బారి నుండి విముక్తి పొందాలంటే... దీపావళి రోజున శ్రీలక్ష్మీ నిత్యపూజ లేదా శ్రీ ధనలక్ష్మీ నిత్య పూజలు చేయాలి.

ఈ పర్వదినాన శ్రీలక్ష్మి కుబేర వ్రతాన్ని ఆచరించి ఇంటికి విచ్చేసే సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమలతో పాటు వస్త్రాదులను దానం చేస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.

ఇక... దీపావళి నాడు ఆలయాల్లో నిర్వహించే శ్రీ మహాలక్ష్మీ కోటి కుంకుమార్చన, శ్రీ మహాలక్ష్మీకి 108 కలువ పువ్వులతో చేసే పూజల్లో పాల్గొంటే పుణ్యం లభిస్తుందని ఐతిహ్యం.

ఇకపోతే... దీపాలను అందంగా అలంకరించుకోవడమే దీపావళి పండుగకు గల ప్రత్యేకమన్న విషయం అందరికీ తెలిసిందే. వెండితో తయారైన దివ్వెలలో ఆవునెయ్యిని పోసి తామరవత్తులను దీపాలను వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

ఇదే రోజున సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో నుదుట కుంకుమను దిద్దుకుని, పూజగదిలో రెండు పంచముఖ దీపపు సెమ్మెలలో తామర వత్తులను అమర్చి వెలిగించాలి. తర్వాత ఇంటి నిండా దివ్వెలను వెలిగించి, ఓం మహాలక్ష్మీ దేవ్వ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

Share this Story:

Follow Webdunia telugu