Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి రోజున మహాలక్ష్మీ పూజా వైశిష్ట్యం

Advertiesment
ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం వెండివెలుగుల దీపావళి భారతీయ సంస్కృతికి అద్దం మహాలక్ష్మీ పూజా వైశిష్ట్యం
భారతీయ సంస్కృతికి అద్దం పట్టే పర్వదినాల్లో... అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వీయుజ మాస బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశిగాను, అమావాస్యను దీపావళిగా ఘనంగా జరుపుకుంటున్నారు. నరకాసురుడు అనే రాక్షసుడి నుంచి దేవతలకు విముక్తి లభించిన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. దీపావళి రోజున దీపాలంకరణలు చేసి బాణసంచా కాల్చడం ఆనవాయితీ.

"దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వకమోపహమ్
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప న్నమోస్తుతే.."

జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అందుకే దీపావళి రోజున మహాలక్ష్మీ పూజ చేసి గృహాల్లో దీపాలను అలంకరించుకుంటారు.

దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడాని ఓ విశిష్టత ఉంది. అదేమిటో తెలుసా? పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడైన ఇంద్రుని ఆతిథ్యానికి పరవశించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ఇంద్రునికి ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కరించే రీతిలో, తన వద్ద నున్న ఐరావతమైన ఏనుగు మెడలో వేయగా... అది ఆ హారాన్ని కాలితో తొక్కి వేస్తుంది. దానిని చూసిన దుర్వాస మహర్షి కోపగ్రస్థుడై దేవేంద్రునిని సర్వసంపదలు కోల్పోదువుగాక అని శపిస్తాడు.

దుర్వాస మహర్షి శాపానికి గురైన ఇంద్రుడు రాజ్యం, సంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ స్థితిని గమనించిన శ్రీహరి దేవేంద్రుని ఓ జ్యోతిని వెలిగించి దానిని మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు.

దేవేంద్రుని పూజకు సంతృప్తి చెందిన లక్ష్మీదేవి దేవేంద్రుని అనుగ్రహించి దుర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి కలిగిస్తుంది. శ్రీహరికి ధర్మపత్నిగానే కాకుండా నన్ను కొలిచే భక్తులకు అష్టలక్ష్మీ దేవిగా అనుగ్రహిస్తానని తెలుపుతుంది.

Share this Story:

Follow Webdunia telugu