Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపావళి రోజున.. శ్రీ లక్ష్మీ కుబేర పూజ చేస్తే..?

దీపావళి రోజున.. శ్రీ లక్ష్మీ కుబేర పూజ చేస్తే..?
, గురువారం, 12 నవంబరు 2020 (17:52 IST)
ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. దీపావళి పండుగ రోజున శ్రీ లక్ష్మిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే దీపావళి పర్వదినాన లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసింపదలు వెల్లివిరుస్తాయి. అలాగే అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే దీపావళి నాడు కుబేర వ్రతాన్ని ఆచరించడం ఎంతో మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
నరకాసురుని వధించిన దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. దీపావళి రోజున లేదా మంగళ, శుక్రవారాల్లో ఓ చెక్క పీఠంపై కుబేర ప్రతిమను లేదా పటాన్ని ఉంచాలి. పటానికి ముందు ముగ్గును బియ్యం పిండితో అలంకరించుకోవాలి. 9 నాణేలను తీసుకుని కుబేర ముగ్గుపై గల సంఖ్యలపై ఉంచాలి. 
 
పూజకు ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించుకోవచ్చు. కుబేర పూజకు నాణేలు, ఎరుపు పువ్వులు తప్పనిసరిగా ఉండాలి. దీపారాధనకు ముందు కుబేర శ్లోకం లేదా కుబేర మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయని విశ్వాసం. అలాగే కుబేర గాయత్రీ మంత్రం : ఓం యక్ష రాజాయ విద్మయా అలికదేషాయా ధీమహి తన్నా కుబేర ప్రచోదయాత్.. ను 108సార్లు పఠిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి... ఈ రోజు నీటిలోకి గంగ, నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి వస్తారట...