కావలసినవి: పెసరపప్పు - 1కప్పు, సగ్గుబియ్యం - అర కప్పు, చక్కెర - ఒకటిన్నరకప్పు, జీడిపప్పు, కిస్మిస్ - పది, ఏలకుల పొడి - ఒక టీ స్పూన్, పాలు - అర లీటరు, నెయ్యి - ఒక టేబుల్ స్పూన్.
తయారు చేయు విధానం: పెసర పప్పును మందపాటి పాత్రలో (నూనె లేకుండా) చేసి సన్న మంట మీద ఎర్రగా వేయించి, అందులో నీరు పోసి ఉడికించాలి. సగ్గుబియ్యాన్ని విడిగా మరొక పాత్రలో ఉడికించి పెసరపప్పులో కలపాలి. అందులో చక్కెర వేసి పదినిమిషాల సేపు ఉడికించిదించాలి. చల్లారిన తర్వాత ఏలకుల పొడి, మరిగించి ఉంచిన పాలను కలపాలి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్తో గార్నిష్ చేయాలి.