మహారాష్ట్రలోని పూణె నగరం దీపావళి కాంతులతో ధగధగలాడుతోంది. చెడుపై మంచి విజయానికి గుర్తుగా వెలిగించే ఈ దివ్వెలు వేలల్లో బారులుతీరాయి. చైతన్యా హాస్య మండలి ఆధ్వర్యంలో శాంతి వరోదా ప్యాలెస్లో 65 వేల దివ్వెలను వెలిగించారు. ఈ దీపాల సంబరాల్లో విదేశీ పర్యాటకులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.
"దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వకమోపహమ్
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప న్నమోస్తుతే.."
దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. ఏ ఇంటిలో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో... ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెపుతోంది.