Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆపార్టుమెంట్ నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

suicide
, శుక్రవారం, 28 జులై 2023 (12:11 IST)
ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఒక బహుళ అంతస్తు భవనం నుంచి కిందకు దూకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగింది. గద్వాల్ పట్టణంలోని భీం నగర్ కాలనీలో నివాసముంటున్న వివాహిత జయలక్ష్మి (40) ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం ఆమె ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉన్న అపార్టుమెంట్‌ ఆరో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. 
 
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతురాలు రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం...  
 
తీసుకున్న అప్పు తీర్చలేదన్న అక్కసుతో కట్టుకున్న భర్త కళ్లెదుటే భార్యను కొందరు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ దారుణం మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. ఈ ఘటన ఫిబ్రవరి నెలలో జరుగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు కామాంధులు వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం బహిర్గతమైంది. 
 
పూణెకు చెందిన బాధిత భార్యాభర్తలు ఇంతియాజ్ షేక్ అనే వ్యక్తి నుంచి కొంతకాలం క్రితం కొంత మొత్తంలో రుణం తీసుకున్నారు. దాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేక పోయారు. ఈ క్రమంలో నిందితుడి మహిళ భర్తను కత్తితో బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ అకృత్యాన్ని కామాంధులు వీడియో తీశారు. 
 
ఆతర్వాత పలుమార్లు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఎదురు చెప్పకపోవడంతో ఆ వీడియోను సోమాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశారు. అతడి ఆగడాలను భరించలేని దంపతులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను మంచానికి కట్టేసి.. గొడ్డలితో నరికి.. ఐదు ముక్కలు చేసిన భార్య... ఎక్కడ?