Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్వీస్ రివాల్వర్‌తో ఎస్ఐను కాల్చి చంపేసిన కానిస్టేబుల్.. ఎక్కడ?

Advertiesment
gunshot

ఠాగూర్

, ఆదివారం, 3 నవంబరు 2024 (16:51 IST)
ఓ పోలీస్ కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డారు. సర్వీస్ రివాల్వర్‌తో ఎస్ఐ‌ను కాల్చి చంపేశాడు. ఈ దారుణం మణిపూర్ రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో శనివారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో గత కొంతకాలంగా అల్లర్లు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలోని రెండు తెగలకు చెందిన ప్రజల మధ్య ఈ ఘర్షణలు  చోటు చేసుకుంటున్నాయి. దీంతో పలు గ్రామాల్లో పోలీస్ పోస్టులు ఏర్పాటు చేసి హింస చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో జిరిబామ్ జిల్లా మాంగ్ బంగ్ గ్రామంలోని పోలీస్ పోస్ట్‌లో కానిస్టేబుల్ బిక్రమ్ జిత్ సింగ్, ఎస్ఐ షాజహాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య శనివారం తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ముదరడంతో కానిస్టేబుల్ బిక్రమ్ జిత్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్‌తో పాయింట్ బ్లాక్ రేంజ్‌లో ఎస్ఐ కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిప్రాణాలు కోల్పోయాడు. 
 
తుపాకీ శబ్దం వినిపించిన మిగిలిన పోలీస్ సిబ్బంది బిక్రమ్ జిత్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే, కానిస్టేబుల్, ఎస్ఐల మధ్య కాల్పులకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దివ్యాంగురాలి కోటాలో టీచర్ ఉద్యోగం.. తొలగింపు సబబేనన్న హైకోర్టు