Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోదరిని కలవకుండా అడ్డుకున్న అన్నయ్య: కత్తితో పొడిచి చంపేసిన ఇద్దరు మైనర్లు

Advertiesment
Love affair
, బుధవారం, 25 ఆగస్టు 2021 (15:07 IST)
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. సోదరిని కలవకుండా అడ్డుకున్నంటున్న 15 ఏళ్ల బాలుడిని ఇద్దరు మైనర్లు కత్తితో పొడిచి హత్య చేశారు. 
 
ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. దీని వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 17 ఏళ్ల వయస్సు గల ఇద్దరు నిందితులైన బాలురు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 
 
మృతుడు, 9వ తరగతి చదువుతున్న విద్యార్థి, భోజన విరామ సమయంలో పాఠశాల ఆవరణలో ఉన్నప్పుడు ఇద్దరు నిందితులు అక్కడికి చేరుకుని అతనితో వాగ్వాదానికి దిగారు. అకస్మాత్తుగా, ఒక నిందితుడు బాలుడి పొత్తికడుపులో కత్తితో పొడిచాడు. అక్కడి నుండి తప్పించుకునే ముందు, ఇద్దరూ స్కూల్ సిబ్బందిపై కత్తిని కూడా విసిరారు.
 
బాధితుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి సోదరి, అదే పాఠశాలలో చదువుతోంది. ఈమె కోసమే వారు ఈ దారుణానికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇద్దరు నిందితులు కూడా తన సోదరుడిని పాఠశాల ఆవరణలో కొట్టారని పోలీసులకు సమాచారం అందించారు.
 
మంగళవారం జరిగిన సంఘటన తర్వాత, పరారీలో ఉన్న నిందితుల కోసం రాయ్‌గఢ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ మీనా వెంటనే నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు.
 వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యునైటెడ్ స్టేట్స్‌లో డెల్టా వేవ్ విజృంభణ.. 1.5 లక్షల కేసులు