Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడు రాలేదనీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. ఎక్కడ?

ప్రియుడు రాలేదనీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. ఎక్కడ?
, గురువారం, 2 నవంబరు 2023 (09:31 IST)
తాను పిలిచినప్పటికీ ప్రియుడు రాకపోవడంతో ఆగ్రహించిన ఓ ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కావడం గమనార్హం. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు చెందిన ఖుష్బు శర్మ(32) అనే మహిళ కేపీహెచ్‌బీ పరిధి వన్‌సిటీలోని ఏ బ్లాక్‌లో ఉంటూ, గూగుల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. ఈమెకు ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌లో నెల్లూరుకు చెందిన మనోజ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మనోజ్ హైదరాబాద్‌లోని మియాపూర్‌లో వ్యాపారం చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో మనోజ్‌తో ప్రేమలో పడిన ఖుష్బు శర్మ... మంగళవారం ఉదయం మనోజ్‌ను తన వద్దకి రమ్మని కోరగా, తర్వాత వస్తానని చెప్పాడు. ఆ తర్వాత కూడా రాకపోవడంతో కారులో మియాపూర్‌ బయలుదేరింది. మార్గమధ్యలో మనోజ్‌కు ఫోన్‌ చేసి వసంతనగర్‌ కమాన్‌ వద్ద ఉన్నానని, రాకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అతను వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉండటంతో ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల్లో పోటీకి డీకే అరుణ దూరం.. ఓటమి భయమే కారణమా?