Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య కోసం కోటి రూపాయల ఇల్లు.. భార్యకు కాంట్రాక్టర్‌పై మోజు.. ఏం చేసిందంటే?

Couple
, శుక్రవారం, 1 డిశెంబరు 2023 (12:41 IST)
Couple
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని చకేరీలోని స్వర్ణ్ జయంతి విహార్‌లో ఓ ఉపాధ్యాయుడు తన భార్యాపిల్లల కోసం కోటి రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించాడు. అదే ఇంటిని నిర్మించిన కాంట్రాక్టర్‌తో కలిసి ఆయన భార్య తన భర్తను కారులో ఢీకొట్టించి హత్యచేయించింది. 
 
కాంట్రాక్టర్ తన సోదరుడు, కారు డ్రైవర్‌కు నాలుగు లక్షల రూపాయల తాయిలాన్ని ఇచ్చి హత్యను ప్రమాదంగా చూపించాడు. అయితే సంఘటన స్థలం దగ్గర అమర్చిన సిసి కెమెరాలు, అతని భార్య  సిడిఆర్ (కాల్ డిటెయిల్ రికార్డ్) సహాయంతో , సేన్ పశ్చిమ్ పారా పోలీస్ స్టేషన్ నిందితులను 24 రోజుల్లో అరెస్టు చేయగలిగారు. 
 
ఈ ఘటన వెలుగులోకి రావడంతో భార్య, కాంట్రాక్టర్‌, బంధువును అరెస్టు చేయగా, హత్యకు పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడు. టీచర్ రాజేష్ గౌతమ్ మృతి కేసులో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. నవంబర్ 4వ తేదీ తెల్లవారుజామున టీచర్‌ను చితకబాదిన ఈకో కారు కొంతదూరంలో వ్యాగన్ఆర్ కారుతో వెళుతున్నట్లు సౌత్ ఏడీసీపీ అంకిత శర్మ తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఈకో డ్రైవర్ అదే వ్యాగన్ఆర్ కారులో పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రాండ్ హోటల్ నుంచి ఫిఫ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. చచ్చిన బొద్దింక కూడా?