Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారం

బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారం
, సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (23:30 IST)
మేకలను పెంచడం అమ్మడం.. డబ్బులు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించడం ఇదే ఆ కుటుంబం పని. ఒకే ఒక్క కుమార్తె. ఆమెకు 13 యేళ్ళు. తండ్రితో పాటు ఆమె కూడా మేకలను మేస్తూ ఉండేది. అయితే ఎప్పటిలాగే మేకలను మేపడానికి వెళ్ళిన ఆ బాలికను కొంతమంది కిడ్నాప్ చేశారు. అతి క్రూరంగా బాలికపై అత్యాచారం చేశారు.

 
రాజస్థాన్ లోని భరత్ పూర్‌లో దారుణం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. కోహ్ పోలీస్టేషన్ పరిధిలో నివాసముండే ఒక బాలిక గొర్రెలను మేపుతూ అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. మధ్యాహ్నం 2గంటల సమయం. ఐదుమంది యువకులు మూడు ద్విచక్రవాహనాల్లో అటువైపుగా వెళుతున్నారు.

 
అయితే వారికి ఈ బాలిక కనిపించింది. వెంటనే ఆమె నోటిని మూసివేసి ఎత్తుకెళ్ళారు యువకులు. సాయంత్రం అయినా బాలిక ఇంటికి రాకపోవడంతో తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంత వెతికినా బాలిక ఆచూకీ మాత్రం దొరకలేదు.

 
అయితే రెండురోజుల తరువాత బాలిక ఇంటికి వచ్చింది. రెండు రోజుల నుంచి 16 మంది యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఏడుస్తూ చెప్పింది. అంతేకాదు కనీసం తిండి కూడా పెట్టలేదని.. చిత్రహింసలకు గురిచేశారని చెబుతూ కన్నీంటి పర్యంతమైంది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు నిందితులను వెతికే పనిలో పడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లై యాష్‌- బాక్సైట్‌ వ్యర్థాల వినియోగం కోసం నిర్మాణ రంగ పరిశ్రమతో వేదాంత అల్యూమినియం భాగస్వామ్యం