Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

Advertiesment
crime

సెల్వి

, బుధవారం, 3 సెప్టెంబరు 2025 (23:12 IST)
ఒంగోలు సీసీఎస్, తాలూకా పోలీసులు మంగళవారం పలు కేసుల్లో నేపస్థుడైన చైన్ స్నాచర్‌ను అరెస్టు చేసి, దాదాపు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోని రత్నపురి కాలనీకి చెందిన నిందితుడు తాళ్లూరి రాజ్ కుమార్ (30) డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కానీ సోషల్ మీడియాలో చైన్ స్నాచింగ్ వీడియోలను చూసిన తర్వాత నేరాలకు పాల్పడ్డాడు. 
 
రాజ్ కుమార్ నేరాలు తెనాలిలో ప్రారంభమై, తరువాత బాపట్ల, చీరాల, ఒంగోలు, వినుకొండలకు వ్యాపించాయి. ఈ సంవత్సరం కనీసం నాలుగు ప్రధాన కేసుల్లో అతను పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 4, 2025న, బాపట్లలోని జండాచెట్టు వీధి చేపల మార్కెట్ సమీపంలో ఒక మహిళ గొలుసును లాక్కున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 24న చీరాలలో మరో సంఘటన జరిగింది. 
 
జూలై 18న ఒంగోలులోని లేడీస్ హాస్టల్‌లో, ఆగస్టు 8న వినుకొండ మెయిన్ బజార్‌లో అతను చైన్ స్నాచింగ్ చేశాడు. అయితే సీసీఎస్ సీఐ ఎస్. జగదీష్, తాలూకా సీఐ టి. విజయ్ కృష్ణ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సాంకేతిక నిఘా ద్వారా అతనిని ట్రాక్ చేసి ఒంగోలు ఐటీఐ సమీపంలో అరెస్టు చేశాయి. దీంతో పలు నేరాల్లో నిందితుడైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెల్తీఫైమీ, విజయా డయాగ్నోస్టిక్స్‌తో జీరోహార్మ్ భాగస్వామ్యం