Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!

Advertiesment
murder

ఠాగూర్

, సోమవారం, 24 మార్చి 2025 (09:44 IST)
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. మరో వ్యక్తితో ఫోనులో చాటింగ్ చేస్తుందని భావించిన ఓ వ్యక్తి తల్లితో పాటు ఆమె కుమార్తెను కూడా హత్య చేశాడు. ఈ దారుణం రాజమండ్రి హక్కంపేట డి బ్లాకులో చోటుచేసుకుంది. మృతులను ఎండీ సల్మాన్ (38), ఆమె కుమార్తె ఎండీ సానియా (16)లుగా గుర్తించారు. ఈ హత్యల తర్వాత నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 
 
పోలీసుల కథనం మేరకు.. హక్కంపేటకు చెందిన సల్మాన్ ఈవెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేది. ఆమెతో కలిసి నిందితుడు శివకుమార్ కూడా వెళ్లేవాడు. అలా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తనను కాదని మరో వ్యక్తిని సల్మాన్ చాటింగ్ చేస్తుండటాన్ని శివకుమార్ జీర్ణించుకోలేక పోయాడు. 
 
ఈ విషయంపై ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. చిన్నచిన్న మాటలతో మొదలైన గొడవ తీవ్రస్థాయికి చేరుకుని చివరకు హత్యకు దారితీసింది. తల్లిని, కుమార్తెను హత్య చేసిన శివకుమార్ అక్కడ నుంచి నేరుగా ఠాణాకు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!