Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మల ద్వారంలో కేజీ బంగారాన్ని దాచిన ఎయిర్ హోస్టెస్: కన్నూరు ఎయిర్ పోర్ట్‌లో పట్టివేత

gold

ఐవీఆర్

, శుక్రవారం, 31 మే 2024 (17:11 IST)
గోల్డ్ స్మగ్లింగ్. ఎన్ని అక్రమ మార్గాల్లో చేయాలో అన్ని అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఏకంగా ఎయిర్ హోస్టెస్ పట్టుబడటం చర్చనీయాంశమైంది. అది కూడా ఆమె తన మల ద్వారంలో సుమారుగా కిలో బంగారాన్ని దాచి పెట్టుకుని వచ్చింది. పక్కా సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
మే 28వ తారీఖున మస్కట్ నుంచి కేరళ లోని కన్నూర్ విమానాశ్రయానికి ఓ విమానం వచ్చింది. అందులో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్నారు కస్టమ్స్ సిబ్బంది. విమానంలో తనిఖీ చేయగా ఎయిర్ హోస్టెస్ సురభి ఖాతూన్ పైన అనుమానం కలిగింది. 
 
ఆమెను క్షుణ్ణంగా పరిశీలించగా తన మల ద్వారంలో బంగారాన్ని దాచిపెట్టినట్లు తేలింది. ఆమె నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈమె గతంలో కూడా పలుమార్లు గోల్డ్ అక్రమ రవాణా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. సీబీఐకి అప్పగించాలి.. బీజేపీ