Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమోసాలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య!!

Advertiesment
jharkhand woman

ఠాగూర్

, గురువారం, 19 జూన్ 2025 (11:26 IST)
మేఘాలయ హనీమూన్ హత్యోదంతం మరువకముందే మరో మహిళ తన భర్తకు పురుగులు మందు ఇచ్చి హతమార్చిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. గర్హ్వా జిల్లా బహోకుదర్ గ్రామానికి చెందిన బుద్ధనాథ్ సింగ్, ఈ నెల 15వ తేదీన అనుమానాస్పదస్థితిలో మరణించాడు. మృతుడు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా భార్య సునీతనే తన భర్తను చంపినట్టు తేలింది. 
 
ఈ ఘటనకు ముందు రోజు వ్యవసాయానికి అవసరంటూ నిందితురాలు సునీత తన భర్తతో పురుగుల కొనిపించింది. తర్వాత సమోసాలో ఆ మందు కలిపి భర్తకు తినిపించి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వివాహం జరిగిన కేవలం 36 రోజుల్లోనే భార్య ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. 

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌‍పత్ జిల్లా బడౌత్‌ పట్టణంలో ఓ వివాహిత ప్రియుడుతో కలిసి హోటల్ గదిలో ఉండగా అనూహ్యంగా భర్త వచ్చాడు. దీంతో భర్తకు చిక్కకుండా ఉండేందుకు ఆ వివాహిత హోటల్ రూఫ్‌పై నుంచి దూకి పారిపోయింది. ప్రియుడు శోభిత్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 
 
ఈ ఘటన సోమవారం జరుగగా వారిద్దరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున రక్షణ కల్పించాలని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళ హోటల్ గది నుంచి కిందికి దూకి పారిపోతున్న వీడియో వైరల్ మారింది. మహిళ హోటల్ గది నుంచి కిందికి దూకి పారిపోతున్న వీడియో వైరల్‌గా మారింది. 
 
ఈమెకు 2019లో పెళ్లి  కాగా, ఓ కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య విభేదాలు ఉండటంతో ఎస్పీ కార్యాలయంలోని మహిళ విభాగంలో వైవాహిక కౌన్సిలింగ్‌కు నడుస్తోంది. శోభిత్‌ను అదుపులోకి తీసుకుని కేసు విచారిస్తున్నట్టు  డౌత్ ఎస్‌హెచ్వో మనోజ్ కుమార్ చాహల్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య