Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌పై పోరాడి గెలిచేందుకు ప్రయత్నిస్తాం.. అతివిశ్వాసం అస్సల్లేదు..

భారత్‌పై పోరాడి గెలిచేందుకు ప్రయత్నిస్తాం.. అతివిశ్వాసం అస్సల్లేదు..
, మంగళవారం, 2 జులై 2019 (10:58 IST)
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా టీమిండియాతో బంగ్లాదేశ్ మంగళవారం తలపడనుంది. బర్మింగ్ హామ్ వేదికగా వరల్డ్ కప్ పోటీలు సాగనున్న తరుణంలో.. బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ చేతిలో ఓడినప్పటికీ భారత్‌పై విజయం సాధిస్తామన్న అతి విశ్వాసంతో బరిలోకి దిగతున్నట్లు మష్రఫె చెప్పాడు. 
 
ఈ మ్యాచ్‌లో తమ సత్తా చాటుతామని, భారత్ అన్ని విభాగాల్లో బలంగా ఉన్నా, గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని అన్నాడు. ప్రస్తుతం ఏడు మ్యాచ్‌లు ఆడి.. ఏడు పాయింట్లతో ఏడో స్థానంలో వున్న బంగ్లా జట్టు సెమీఫైనల్లోకి చేరుకోవాలంటే.. భారత్-పాకిస్థాన్‌లపై ఆడాల్సిన మ్యాచ్‌లను గెలవడంతో పాటు కివీస్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోవాల్సి వుంటుంది. 
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టైగర్స్ కెప్టెన్ మష్రపై భారత్‌పై గెలిచేందుకు తమ ప్రణాళికలు తమకు వుంటాయని చెప్పాడు. అతివిశ్వాసానికి పోమని.. కానీ శక్తి మేర పోరాడి గెలిచేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. షకిబ్‌‌పైనే భారీ ఆశలు పెట్టుకున్నామని.. ఇదే ఫామ్‌ను షకిబ్ కొనసాగిస్తే మాత్రం టీమిండియాపై విజయం ఖాయమని చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ కప్ 2019 : ఓడిన పిచ్‌పైనే భారత్‌కు అగ్నిపరీక్ష