భారత ఓపెనర్ గౌతం గంభీర్ రెండు వేల పరుగుల క్లబ్లో చేరాడు. మెక్లీన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు నాలుగో రోజైన ఆదివారం గంభీర్ ఈ ఘనతను సాధించాడు. టెస్టుల్లో రెండు వేల పరుగుల క్లబ్లో చేరిన 30వ భారత క్రీడాకారుడు కావడం గమనార్హం. ఈ రికార్డును సాధించేందుకు గంభీర్కు 43 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి.
అంతేకాకండా అత్యం వేగవంతంగా పరుగులు చేసి ఈ ఫీట్ను సాధించాడు. దీంతో విజయ్ హజారే, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తన కెరీర్లో 24వ టెస్ట్ ఆడుతున్న గంభీర్.. 50 సగటుతో కొనసాగుతున్నాడు. నాలుగో రోజున జీతన్ పటేల్ బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా బంతిని నెట్టి రెండు పరుగులు తీయడంతో 2000 పరుగులు పూర్తి చేశాడు.
ఈ టెస్టులో ఢిల్లీ లెఫ్ట్ హ్యండర్ బ్యాట్స్మెన్ సెంచరీతో జట్టును ఆదుకున్న విషయం తెల్సిందే. రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, విజయ్ హజారే, గౌతం గంభీర్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్లు వేగంగా పరుగులు చేసి రెండువేల క్లబ్లో చేరిన బ్యాట్స్మెన్స్గా పేరుంది.