Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా క్రికెట్: పాక్‌పై భారత్ విజయభేరీ

Advertiesment
ఆస్ట్రేలియా ప్రపంచ మహిళా క్రికెట్ పాకిస్థాన్ భారత్ విజయభేరీ జులన్ గోస్వామి క్రికెట్ వార్తలు కట్టడి బౌలింగ్
బౌరాల్ (ఏజెన్సీ) , శనివారం, 7 మార్చి 2009 (13:40 IST)
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రపంచ మహిళా క్రికెట్ కప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మహిళా క్రికెటర్లు అద్భుతంగా రాణించి విజయం సాధించారు. టాస్ గెలిచిన కెప్టెన్ జులన్ గోస్వామి.. ప్రత్యర్థి పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత మహిళా బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో అద్భుతంగా బౌలింగ్ చేసి, 29 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేసింది.

న్యూబాల్ బౌలర్ రుమేలి ధర్ పాక్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. ఎనిమిది ఓవర్లు వేసిన ధర్, ఏడు పరుగలు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసింది. వేసిన ఎనిమిది ఓవర్లలో ఐదు మేడిన్స్ ఓవర్లు కావడం గమనార్హం. అలాగే అమితా శర్మా (2/9), ప్రియాంకా రాయ్ (2/13)లు తమ వంతు సహకారం అందించడంతో పాకిస్థాన్ కుప్పకూలింది.

పాక్ జట్టులో సనా మిర్ 17 పరుగులు చేసి టాప్ స్కోరర్‌ కాగా, ఓపెన్ నైన్ అబిడి 11 పరుగులతో రెండంకెల స్కోరును చేరుకుంది. ఆ తర్వాత 58 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఓపెనర్లు అనగ దేశ్‌పాండ్, అంజుమ్ చోప్రాలు పది ఓవర్లలో విజయ లక్ష్యానికి కావల్సిన పరుగులు రాబట్టారు. దేశ్‌పాండ్ 37 బంతుల్లో 26 పరుగులు చేయగా, చోప్రా 23 బంతుల్లో 17 పరుగుల చేశారు. పాక్ బౌలర్లు మరో 15 పరుగులను ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu