పీసీబీపై కేసు పెట్టనున్న మాజీ కెప్టెన్ యూనిస్!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుచే జీవితకాల నిషేధానికి గురైన మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ యూనిస్ ఖాన్ పీసీబీకి వ్యతిరేకంగా కేసుపెట్టనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న యూనిస్ ఖాన్ గత నెలలో పీసీబీ నియమించిన ప్రత్యేక కమిటీ చేసిన దర్యాప్తు ఆధారంగా జీవిత కాల నిషేధానికి గురైయ్యాడు. దీంతో పీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న యూనిస్ ఖాన్ పాక్ బోర్డు చర్యలకు నిరసనగా కేసు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయమై యూనిస్ ఖాన్ లాయర్ అహ్మద్ ఖయ్యూమ్ మాట్లాడుతూ.. జీవితకాల నిషేధానికి గురైన యూనిస్ ఖాన్ కోర్టులో కేసు పెట్టనున్నట్లు తెలిపారు. న్యాయవాది సలహా మేరకు పీసీబీ నిషేధంపై యూనిస్ ఖాన్ కోర్టులో కేసు పెట్టనున్నట్లు సన్నిహితుల సమాచారం. దీనికి సంబంధించి వివరాలను ఇప్పటికే ఖయ్యూమ్కు యూనిస్ అందజేసినట్లు సమాచారం.