Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్వంటీ-20 వరల్డ్‌కప్: భారత జట్టు కెప్టెన్‌గా గోస్వామి!

Advertiesment
ట్వంటీ20 ప్రపంచకప్
FILE
వెస్టిండీస్‌లో జరిగే ప్రపంచకప్ ట్వంటీ-20‌లో ఆడే భారత మహిళా జట్టుకు బెంగాల్ పేస్-ఉమెన్ జులన్ గోస్వామి కెప్టెన్సీ సారథ్యం వహించనుంది. కరేబియన్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ట్వంటీ-20లో ఆడే భారత మహిళల జట్టును శుక్రవారం జాతీయ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.

14 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఇటీవల సస్పెండ్‌కు గురైన ఎడమ చేతి స్పిన్నర్ పూనమ్ రౌత్‌కు కూడా సెలక్షన్ కమిటీ స్థానం కల్పించింది. మేలో జరుగనున్న ఈ పరిమిత ఓవర్ల ట్వంటీ-20లో ఇంకా మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా, స్టార్ బ్యాట్స్‌ఉమెన్ మిథాలీ రాజ్ మరియు ఆల్-రౌండర్ రుమేలి ధర్‌లకు కూడా జట్టులో చోటు సంపాదించుకున్నారు.

జట్టు వివరాలు: జులన్ గోస్వామి (కెప్టెన్), మిథాలీ రాజ్, పూనమ్ రౌత్, సులక్షణ నాయక్, అనఘా దేశ్‌పాండే, రుమేలి ధర్, అమిత శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, రీమా మల్హోత్రా, డయానా డేవిడ్, గౌహర్ సుల్తానా, సోనియా దబీర్, ప్రియాంక రాయ్, అంజుమ్ చోప్రా.

Share this Story:

Follow Webdunia telugu