Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్-3: బెంగళూరు-ఢిల్లీ జట్ల మధ్య సమరం నేడే..!

Advertiesment
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మూడో అంచె పోటీలలో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరుగనుంది. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో గెలుపుపై ధీమా ఉంది. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచినా, ఆ తరువాత వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సరే గెలుపొందాలనే పట్టుదలతో ఉంది.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గౌతం గంభీర్ గాయాల బారిన పడటంతో ఆ జట్టు కాస్త ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ జట్టులో డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కడే మెరుగ్గా రాణిస్తుంటే, మిగతా ఆటగాళ్లు విఫలం అవుతున్నారు. దీంతో ఆ జట్టును ఓటమి వీడటం లేదు. ఐపీఎల్-2లో సత్తా చాటుకున్న డివిలియర్స్ మూడో అంచె పోటీలలో మాత్రం అంతంమాత్రంగానే రాణిస్తున్నాడు. దీంతో ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్‌లో గెలుపొందాలంటే గట్టి పోరాటమే చేయాల్సి ఉంది.

మరోవైపు బెంగళూర్‌ జట్టు నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లలో సమతూకంగా ఉన్న ఈ జట్టులో కలిస్‌ అద్భుత ఫామ్‌తో చెలరేగి ఆడుతున్నాడు.

ఐపీఎల్-3లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లలో చాలా వాటిలో అతను ఒంటి చేత్తో జట్టుకి విజయాన్ని అందించాడంటే అతిశయోక్తి కాదు. అలాగే ఈ జట్టులో మనీష్‌ పాండే, ఊతప్ప కూడా నిలకడగా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో వినయ్‌, ప్రవీణ్‌ మెరుపులు మెరిపిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు ఢిల్లీకే మెరుగ్గా ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu