ఐపీఎల్ సమరం: పంజాబ్ కింగ్స్తో సచిన్ సేన ఢీ నేడే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా 27వ లీగ్ మ్యాచ్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో తలపడనుంది. పీఎల్ మూడో సీజన్లో విజయపరంపరను కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్, ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్లో కూడా గెలుపును నమోదు చేసుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు ఐపీఎల్-3లో పరాజయాలతో కొట్టిమిట్టాడుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముంబై ఇండియన్స్పై ధీటుగా రాణించడం సందేహమేనని క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ప్రస్తుతం ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదు విజయాలతో ముందంజలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేవలం ఒకే ఒక్క ఓటమితో విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్ ఈసారి టైటిల్ను నెగ్గడమే లక్ష్యంగా రాణిస్తోంది.కానీ పంజాబ్ కింగ్స్ జట్టును కెప్టెన్ మార్పు వెంటాడుతోంది. గత ఏడాది కేకేఆర్ను కెప్టెన్సీ మార్పు ఎలా వేధించిందో.. అదే తరహాలో ఈసారి పంజాబ్కు కూడా చుక్కెదురైంది. దీంతో ప్రస్తుతం ఆరు మ్యాచ్లాడిన పంజాబ్ కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసుకోవడం గమనార్హం. ఫలితంగా ఐపీఎల్ పట్టికలో చివరి స్థానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనసాగుతోంది. కాగా.. మంగళవారం రాత్రి ఏడుగంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ ధీటుగా రాణించే అవకాశం ఉంది.