Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయేషాతో నాకు శారీరక సంబంధంలేదు: షోయబ్ మాలిక్

Advertiesment
షోయబ్ మాలిక్
PTI
అయేషాతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అంటున్నాడు. నిన్నటి వరకు అయేషా ఎవరనే విషయం తెలియదని, ఆమెతో ఫోన్‌లో మాత్రమే నిఖా చేసుకున్నానని, తనను ఆమే మోసం చేసిందంటూ క్షణానికో మాట మారుస్తున్న షోయబ్, తాజాగా అయేషా చేతిలో తానే మోసపోయానని పోలీసుల విచారణలో అన్నాడు. పాస్‌పోర్ట్ స్వాధీనంపై పాక్ ఎంబసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.

షోయబ్‌తో కలిసి పాకిస్థాన్ రెసిడెన్సీ హోటళ్లో మూడు రోజుల పాటు గడిపానని, అతని వల్ల గర్భవతిని కూడా అయ్యాయని అయేషా పోలీసుల విచారణలలో చెప్పింది. అయితే ఇవన్నీ నిజం కాదని పాక్ రెసిడెన్సీ హోటల్‌కు కేవలం డిన్నర్‌ చేసేందుకు మాత్రమే వెళ్లామని మాలిక్ వెల్లడించాడు. తప్పుడు ఫోటోలు, నిఖానామాలో ఫోర్జరీ సంతకాలతో ఆమె తనను మోసం చేసిందని మాలిక్ తెలిపాడు.

సానియాతో పెళ్లికి అభ్యంతరం లేదు: అయేష
ఇదిలా ఉంటే.. షోయబ్ మాలిక్‌ స్నేహంతో గర్భవతిని అయినప్పటికీ అబార్షన్ చేయించుకున్నానని అయేషా చెప్పింది. షోయబ్‌తో 2002లో వివాహం జరిగిందని, మాలిక్ హైదరాబాద్ వస్తే మా ఇంట్లో ఉండేవాడని అయేషా పోలీసుల విచారణలో తెలిపింది. కాగా.. భారత టెన్నిస్ స్టార్ సానియాను మాలిక్ వివాహం చేసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అయేషా స్పష్టం చేసింది.

కానీ షోయబ్ మాలిక్ నుంచి తాము ఎలాంటి డబ్బును ఆశించడం లేదని, విడాకులు మాత్రమే కోరుతున్నామని అయేషా కుటుంబసభ్యులు పోలీసుల విచారణలో కోరారు. ఇంకా అయేషాకు జరిగిన అన్యాయానికి షోయబ్ మాలిక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu