Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జింబాబ్వే పర్యటనకు ధోనీ - కోహ్లీ - రోహిత్‌లకు విశ్రాంతి? పెదవి విప్పని సెలక్టర్లు!

Advertiesment
MS Dhoni
, శుక్రవారం, 20 మే 2016 (16:06 IST)
భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన కోసం ఎంపిక చేసే టీమిండియా సభ్యులపై బీసీసీఐ సెలక్టర్లు ఏమాత్రం పొరబయటకు రానివ్వడం లేదు. దీంతో జట్టు ఎంపికపై పలు రకాలైన ఊహాగానులు వెలుపడుతున్నాయి.
 
ముఖ్యంగా.. ధోనీతో పాటు కోహ్లీ, రోహిత్, ధావన్‌లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ధోనీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ధోనీకి కూడా విశ్రాంతినివ్వొచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. 
 
దీనికి కారణం లేకపోలేదు.. జింబాబ్వే జట్టుపై ప్రథమ శ్రేణి జట్టు అవసరం లేదన్నది సెలక్టర్ల ఆలోచన. దీంతో ఈ టోర్నీ ద్వారా భారత్ రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తోంది.
 
అందుకే కోహ్లీ, రోహిత్, ధావన్‌లతో పాటు.. ధోనీకి కూడా విశ్రాంతినిచ్చి ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసి జింబాబ్వేకు పంపాలన్న ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, జట్టులో కొనసాగాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారం ధోనీకే వదిలేయాలని నిర్ణయించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ద్రావిడ్ కంటే గొప్పోళ్ళు ఎవరున్నారు : గవాస్కర్