Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లైన వాళ్లకి తొందరెక్కువ: సెహ్వాగ్ ట్వీట్.. అశ్విన్ థ్యాంక్స్.. ప్రీతి, ఆర్తి ఏమన్నారంటే?

క్రికెట్ కాస్త దూరమైనా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు. అప్పుడప్పుడు వీరేంద్రుడు సోషల్‌ మీడియాలో చిన్నపాటి చర్చ పెట్టేస్తున్నాడు. తాజాగా మూడు టెస్టుల సిరీస్‌లో టీమి

Advertiesment
Virender Sehwag
, బుధవారం, 12 అక్టోబరు 2016 (17:01 IST)
క్రికెట్ కాస్త దూరమైనా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు. అప్పుడప్పుడు వీరేంద్రుడు సోషల్‌ మీడియాలో చిన్నపాటి చర్చ పెట్టేస్తున్నాడు. తాజాగా మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా విజయం సాధించిన జట్టుకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే అద్భుత ఆటతీరుతో ఏడోసారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను గెలుచుకున్న స్పిన్నర్ అశ్విన్‌కి అభినందనలు తెలిపాడు. 
 
మూడో టెస్టులో 13వికెట్లతో.. అటు మ్యాచ్‌తో పాటు ఇటు సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి అశ్విన్ ప్రదర్శన టీమ్ ఇండియాకు ఎంతగానో ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో వేగంగా మ్యాచ్ ముగించేసి ఇంటికెళ్ళాల్సిన తొందరేంటో పెళ్ళైన వాళ్లకే అర్థమవుతుందంటూ అశ్విన్ గురించి వీరేంద్ర సెహ్వాగ్ చమత్కారంగా ట్వీట్ చేశాడు. అందుకు అశ్విన్ థ్యాంక్స్ చెప్పాడు. 
 
ఇదే ట్వీట్‌పై అశ్విన్ వైఫ్ ప్రీతి లైట్‌గా స్మైల్ ఇస్తూ 'హాహాహా.. నేనేం చేయనండి' అంటూ రిప్లై ఇచ్చేసింది. ఇందులోని సెహ్వాగ్ వైఫ్ ఆర్తి కూడా వచ్చేసింది. 'వాళ్లిద్దరికీ (అశ్విన్, సెహ్వాగ్) ఎప్పుడూ తొందరెక్కువ' అని ట్వీట్ చేసింది. ఈ సరదా ట్వీట్స్ అందరినీ ఎట్రాక్ట్ చేసుకుంటున్నాయి. ఈ కామెంట్స్‌కు లైకులు వెల్లువెత్తుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బులివ్వకుండా మోసం చేసిందని ధోనీ భార్యపై 420కేసు!