ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కీలక సమయంలో ధోనిని యువరాజ్ సింగ్ రన్ అవుట్ చేసి హైదరాబాద్ సూపర్ విజయం అందించడమే కాకుండా.. ధోనిపై కసి తీర్చుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత తరువాత 138 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసి 4 పరుగులతో ఓడింది.
చివరి ఓవర్ లో 3 బంతుల్లో 12 పరుగులు చేయవలసిన దశలో నెహ్రా వేసిన ఫుల్ టాస్ని ధోని సిక్సర్గా మలిచాడు. 2 బంతుల్లో 6 పగురుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో ధోని మరో షాట్కి ప్రయత్నించినా.. ఆ బంతి ఓవర్ త్రోని యువరాజ్ అందుకున్నాడు. దీంతో ధోనిని యువరాజ్ అవుట్ చేయడంతో.. చివరి బంతికి కుడా వికెట్ పడడంతో పుణే ఈ సీజన్లో ఎనిమిదో మ్యాచ్ ఓడిపోవడంతో ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు అయ్యాయి. తద్వారా ధోనీని యువరాజ్ కసి తీర్చుకున్నాడు.