Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అన్నా నువ్వెప్పుడూ నా కెప్టెన్ వే' : ధోనీపై కోహ్లీ ఎమోషనల్ ట్వీట్

భారత క్రికెట్ వన్డే, ట్వంటీ-20 జట్లకు సారథ్య బాధ్యతల నుంచి ఎం.ఎస్.ధోనీ తప్పుకున్నాడు. దీనిపై టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగంతో కూడిన ట్వీట్ పోస్ట్ చేశాడు. "యువకులకు నిత్యమూ ఓ ల

Advertiesment
Virat Kohli thanks MS Dhoni for being a wonderful skipper through emotional tweet
, శుక్రవారం, 6 జనవరి 2017 (12:41 IST)
భారత క్రికెట్ వన్డే, ట్వంటీ-20 జట్లకు సారథ్య బాధ్యతల నుంచి ఎం.ఎస్.ధోనీ తప్పుకున్నాడు. దీనిపై టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగంతో కూడిన ట్వీట్ పోస్ట్ చేశాడు. "యువకులకు నిత్యమూ ఓ లీడర్‌గా ఉండి వారిని నడిపించినందుకు కృతజ్ఞతలు. చుట్టూ యంగ్‌స్టర్స్ ఉండాలని భావిస్తుంటావు. అన్నా ఎప్పటికీ నా కెప్టెన్ నువ్వే" అని ఈ ఉదయం 9:30 గంటల సమయంలో ట్వీట్ పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. 
 
కాగా, త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ధోనీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా ఆడనున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య జనవరి 15న తొలి మ్యాచ్ పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.
 
మరోవైపు.. కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడంతో ఈ నెల 15న ఇంగ్లండ్‌తో మొదలయ్యే వన్డే సిరీస్‌ కోసం టీమిండియా జట్టు ఎంపిక జరగనుంది. సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో శుక్రవారం జరిగే సమావేశంలో.. భారత వన్డే, టీ-20 పగ్గాలు కోహ్లీకి అప్పగించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై చెప్పిన వేళ... గంతులేసిన యువరాజ్ తండ్రి?