Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హ్యాపీగా దీపావళి సెలెబ్రేట్ చేసిన కోహ్లీ, అనుష్క.. గోవాలో తళుక్కుమన్న ప్రేమ జంట..

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. శనివారం విశాఖపట్నంలో కివీస్ చివరి వన్డే మ్యాచ్ పూర్తయిన తర్వాత కోహ్లీ గోవాకు ప్రయాణమయ్య

Advertiesment
Virat Kohli
, మంగళవారం, 1 నవంబరు 2016 (09:00 IST)
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. శనివారం విశాఖపట్నంలో కివీస్ చివరి వన్డే మ్యాచ్ పూర్తయిన తర్వాత కోహ్లీ గోవాకు ప్రయాణమయ్యాడు. ఐఎస్ఎల్.. ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా ఎఫ్‌సీ గోవా, ఢిల్లీ డైనమోస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ జంట కనిపించారు. ఈ మ్యాచ్‌ను వీక్షిస్తూ ఈ జంట హ్యాపీగా గడిపారు.
 
ఎఫ్‍‌సీ గోవా సహ యజమాని అయిన కోహ్లి టీమ్ జెర్సీలో మెరిశాడు. అనుష్క తెలుపు రంగు సల్వార్ సూట్‌లో సింపుల్‌గా ఉంది. చాలా కాలం తర్వాత కోహ్లి-అనుష్క కలిసి బహిరంగంగా కనబడడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఎస్ఎల్ మ్యాచ్ సందర్భంగా వీరితో కలిసి ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.
 
కోహ్లీ, అనుష్క చిరునవ్వుతో ఫ్యాన్స్‌తో ఫొటోలకు ఫోజులిచ్చారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-2తో గెలిచిన సంగతి తెలిసిందే. శనివారం విశాఖపట్నంలో జరిగిన చివరి వన్డేలో విజయం సాధించి ధోనిసేన సిరీస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్ల్యూటీఏ ఫైనల్స్‌‌లో ఓడినా.. ర్యాంకులో సానియా-టీనా జోడీ టాపే..