Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విండీస్ గడ్డపై మూడో సిరీస్ కైవసం.. విరాట్ కోహ్లీ హ్యాపీ హ్యాపీగా ట్వీట్!

విండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. తద్వారా విండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో సిరీస్‌‌ని దక్కించుకుంది. కోహ్లీ సారథ్యంలో ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. శ్రీ

విండీస్ గడ్డపై మూడో సిరీస్ కైవసం.. విరాట్ కోహ్లీ హ్యాపీ హ్యాపీగా ట్వీట్!
, ఆదివారం, 14 ఆగస్టు 2016 (11:55 IST)
విండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. తద్వారా విండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో సిరీస్‌‌ని దక్కించుకుంది. కోహ్లీ సారథ్యంలో ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్‌లపై వరుసగా సిరీస్‌లు నెగ్గి హాట్రిక్ విజయాలను అందించిన కెప్టెన్‌గా నిలిచాడు.

గతంలో 2006, 2010ల్లో కరీబియన్లను ఓడించిన భారత్.. నాలుగు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కోహ్లీ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకునేందుకు కోహ్లీ ట్వీట్ చేశాడు. 
 
టీమిండియా బస్సులో ప్రయాణిస్తుండగా దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఈ జట్టులో సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. జట్టు చాలా అద్భుతంగా రాణించి గెలుపును నమోదు చేసుకుందని ట్వీట్ చేశాడు. అంతకుముందు స్యామీ స్టేడియంలో ముగిసిన మూడో టెస్టులో 237 పరుగుల భారీ తేడాతో భారత్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియో ఒలింపిక్స్‌లో లలితా బాబర్ అదుర్స్.. 3వేల మీటర్ల ఛేజ్‌ ఫైనల్లోకి ఎంట్రీ