Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌: మినీ థియేటర్‌లో చూస్తూ ఎంజాయ్ చేసిన విజయ్ మాల్యా (వీడియో)

Advertiesment
Vijay Mallya
, బుధవారం, 1 జూన్ 2016 (13:02 IST)
భారతలోని పలు బ్యాంకులు రుణాలు (రూ.9 వేల కోట్లు) తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా లండన్‌కు పారిపోయి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిసున్న యూబీ గ్రూపు మాజీ ఛైర్మన్, లిక్కర్ డాన్ విజయ్ మాల్యాకు చెందిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
గత ఐపీఎల్ మ్యాచ్‌ను క్రికెట్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన.. ఇపుడు ఇంట్లోని మినీ థియేటర్‌లో వీక్షించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మినీ థియేటర్‌లో ఉన్న చిన్నపాటి స్క్రీన్‌పై మ్యాచ్‌ను విజయ్ మల్యా, అతని కంపెనీ సభ్యులు ఈ మ్యాచ్‌ను వీక్షించడం కనిపిస్తోంది. వీరితో పాటు ఓ మహిళ కూడా ఈ మ్యాచ్‌ను వీక్షిస్తూ కనిపించారు. 
 
కాగా, ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్-9 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడిన విషయం తెల్సిందే. ఆర్సీబీ జట్టుకు విజయ్ మాల్యా యజమాని అయిన విషయం తెల్సిందే. దీంతో ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోనేషియా ఓపెన్.. ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సైనా నెహ్వాల్!