Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోహ్లీపై కోపం... తలుపును బలంగా తన్నిన అంపైర్

కోహ్లీపై కోపం... తలుపును బలంగా తన్నిన అంపైర్
, మంగళవారం, 7 మే 2019 (19:41 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తన చివరి లీగ్ మ్యాచ్‌ను సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడింది. 
 
అయితే, ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌ ఉమేశ్ యాదవ్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఓ బంతి నోబాల్ కాకపోయినప్పటికీ.. ఫీల్డ్ అంపైర్ నిగెల్ లాంగ్ దాన్ని నోబాల్‌గా ప్రకటించారు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీకి తీవ్ర ఆగ్రహం వచ్చింది. బౌలర్ ఉమేష్ కూడా అంపైర్‌తో గొడవకు దిగారు. మరో అంపైర్ సర్ది చెప్పడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగిపోయింది. మ్యాచ్ యధావిధిగా కొనసాగింది. 
 
కానీ, అసలు కథ మ్యాచ్ ముగిసిన తర్వాతే ప్రారంభమైంది. కోహ్లీతో గొడవ పడిన కోపంలో అంపైర్ నిగెల్ లాంగ్.. స్టేడియంలోని ఓ తలుపును బలంగా తన్నడంతో అదికాస్త విరిగిపోయింది. ఈ విషయాన్ని స్టేడియం అధికారులు గుర్తించి బీసీసీఐకు ఫిర్యాదు చేశారు. దీంతో అంపైర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే దిశగా బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 
 
మరోవైపు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.సుధాకర్‌ రావు మాట్లాడుతూ, 'మేము కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ)కి ఈ వివాదంపై ఫిర్యాదు చేయగా, ఖచ్చితంగా వారు స్పందించి, నిగెల్‌పై చర్య తీసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. మైదానంలో దురుసుగా ప్రవర్తించే ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటే.. అదే మైదానంలో ఉండే అంపైర్లు ఆ విధంగా ప్రవర్తిస్తే ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ప్రశ్నిస్తున్నారు. 
 
కాగా, ఈ ఫిర్యాదుపై బీసీసీఐ స్పందించి చర్యలు తీసుకున్నట్టయితే తదుపరి మ్యాచ్‌లకు ఆయన దూరమయ్యే అవకాశాలు లేకపోలేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, నిగెల్ లాంగ్ తన క్రికెట్ కేరీర్‌లో 56 టెస్టులు, 123 వన్డేలు, 32 టీ-20లకు అంపైరింగ్ చేశారు. అలాగే, ఈనెలాఖరు నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రారంభంకానున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో కూడా అంపైరింగ్ చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఐటీ సెమిస్టర్ ప్రశ్నాపత్రంలో ధోనీ గురించి ప్రశ్న.. వైరల్