Publish Date: Sat, 29 Jun 2024 (15:27 IST)
Updated Date: Sat, 29 Jun 2024 (15:29 IST)
కెన్సింగ్టన్ ఓవల్లో దక్షిణాఫ్రికాతో జరిగే టీ-20 ప్రపంచ కప్ 2024లో చివరి పోరుకు భారత్ సిద్ధమవుతున్న వేళ, ఎడమచేతి వాటం పేసర్ అర్ష్దీప్ సింగ్పై అందరి దృష్టి ఉంటుంది. 7.50 ఎకానమీ రేటుతో 15 వికెట్లతో, టోర్నమెంట్ ఒకే ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును బద్దలు కొట్టడానికి అర్ష్దీప్కి కేవలం మూడు వికెట్ల దూరంలో వున్నాడు.
17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఫజల్హాక్ ఫరూఖీ వున్నాడు. ఇతడిని వెనక్కి నెట్టి ఆ స్థానంలో అర్ష్దీప్ సింగ్ రావాలంటే.. రెండు వికెట్లు పడగొట్టాల్సి వుంటుంది.
ప్రపంచ కప్ ఫైనల్ కోసం ఓటమి ఎరుగని భారత్-దక్షిణాఫ్రికా రెండు జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్న వేళ అర్ష్దీప్ సింగ్ ఆటతీరు కీలకం కానుంది. ఆరంభంలో వికెట్లు తీయడంతోపాటు డెత్ ఓవర్లలో ఒత్తిడిని కొనసాగించడంలో అతని సత్తా భారత్ విజయాల్లో కీలకంగా మారింది.
ఫైనల్ అతనికి అత్యధిక అవుట్ల రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా క్రికెట్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సువర్ణావకాశాన్ని అందిస్తుంది.