Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్వంటీ-20 ప్రపంచ కప్‌- శ్రీలంక భారీ విజయం.. ఐర్లాండ్ చిత్తు

Advertiesment
sri lanka
, ఆదివారం, 23 అక్టోబరు 2022 (15:16 IST)
ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో శ్రీలంక భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తొమ్మిది వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. 
 
హోబర్ట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 128/8 స్కోరు చేసింది. లంక బౌలర్లలో హసరంగ, మహేశ్ తీక్షణ రెండేసి వికెట్లు పడగొట్టారు. 
 
అనంతరం శ్రీలంక 15 ఓవర్లలో 133/1 పరుగులు చేసి అలవోకగా గెలుపును నమోదు చేసుకుంది. ఓపెనర్ కుశాల్ మెండిస్(68 నాటౌట్) అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. ధనంజయ డిసిల్వ (31), చరిత్ అసలంక (31 నాటౌట్) కూడా రాణించారు. కుశాల్ మెండిస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదంలో సిమోనా హలెప్.. ఉత్ర్పేరకాలు వాడింది.. ప్రమాదంలో కెరీర్