Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గారాలపట్టి జివాతో ధోనీ ఆటలు.. సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు..!

గారాలపట్టి జివాతో ధోనీ ఆటలు.. సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు..!
, మంగళవారం, 3 మే 2016 (16:49 IST)
1984కి తర్వాత టీమిండియాకు వన్డే ప్రపంచ కప్ సంపాదించిన పెట్టిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రస్తుతం పరాజయాలే ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంప్రదాయ టెస్టు కెప్టెన్సీని కోల్పోయిన ధోనీ.. ప్రస్తుతం వన్డే, ట్వంటీ-20 కెప్టెన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో ఆశించిన రాణించలేకపోయిన ధోనీ ప్రస్తుతం పుణే తరపున ఆడుతున్నా చెప్పుకోదగ్గ విజయాలను సాధించలేకపోతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో తన గారాలపట్టి జివాతో ఆడుకుంటూ అపజయాల బాధ నుంచి ఉపశమనం పొందుతున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ప్రతి మ్యాచ్‌కు కూతురు జివా, భార్యతో కలిసి వెళ్తున్నాడు. ఇందులో భాగంగా విమానంలో జివాతో కలిసి ఆడుకున్న ఫోటోలను ధోనీ భార్య సాక్షిసింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీకి ఖేల్ రత్న అవార్డు.. కేంద్రానికి బీసీసీఐ లేఖ.. రహానేకు అర్జున అవార్డు..?!