Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోహ్లీ భార్యపై కామెంట్.. మహిళా జర్నలిస్టును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

కోహ్లీ భార్యపై కామెంట్.. మహిళా జర్నలిస్టును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
, మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (15:45 IST)
బాలీవుడ్ హీరోయిన్, క్రికెటర్ సతీమణి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్ పర్యటనలో ఉన్నాడు. అనుష్క భారత్‌లోనే వుంది. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, అనుష్క పోస్టుపై మీనా దాస్ నారాయణ్ అనే ఓ మహిళా జర్నలిస్టు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో విరుష్క ఫ్యాన్స్ చాలామంది ఆ జర్నలిస్ట్‌ని ట్రోల్ చేస్తున్నారు. 
 
మీనా దాస్ తన పోస్ట్‌లో ''అనుష్క నిన్ను విరాట్ కేవలం గర్భవతిని మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ దేశానికి రాణిని కాదు. మీ ఆనందం అనే గుర్రానికి కళ్లెం వేయండి'' అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ ట్వీట్ పై పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్వీట్ పై టాలీవుడ్ దర్శకుడు మారుతి మండిపడ్డాడు. 
 
మహిళా జర్నలిస్టు అయి వుండి సాటి మహిళపై ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు. ప్రతి మహిళకు మాతృత్వం అనేది ఇంగ్లండ్ రాణి అర్హత కంటే గొప్పదని పేర్కొన్నారు. ప్రతి మహిళకు తన ఇల్లే రాజ్యం. అక్కడ తాను ఓ రాణి. అనుష్క సెలబ్రిటీ కాకముందు ఓ మహిళ. గర్భవతిగా ఆమె ఆనందాన్ని, తన బేబీ బంప్‌ను చూపేందుకు అన్ని విధాలా అర్హురాలు" అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2020 ఏర్పాట్లను పర్యవేక్షించిన గంగూలీ!