Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పోర్ట్స్ ప్రో సర్వే.. విరాట్ కోహ్లీకి మూడో ర్యాంకు.. టాప్-50లో సానియా మీర్జా!

స్పోర్ట్స్ ప్రో సర్వే.. విరాట్ కోహ్లీకి మూడో ర్యాంకు.. టాప్-50లో సానియా మీర్జా!
, శుక్రవారం, 27 మే 2016 (14:44 IST)
స్పోర్ట్స్ ప్రో సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మూడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ కోహ్లీ ఓ ఉత్పత్తికి ప్రచారం చేస్తే.. ఆ ఉత్పత్తికి ఏ స్థాయిలో పాపులారిటీ దక్కుతుంది. ఇంకా ఆ ప్రాడెక్ట్ ఎంతమంది వినియోగదారులరై కోహ్లీ ప్రచారం ప్రభావం చూపుతుందనే అంశాలపై సర్వే చేసే స్పోర్ట్స్ ప్రో సంస్థ అతనికి మూడో ర్యాంకు ఇచ్చింది. 
 
ఇంకా ఆ సంస్థ విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో ఎన్‌బీఏ బాస్కెట్‌బాల్ స్టార్ స్టీఫెన్ కర్రీ అగ్రస్థానంలో నిలవగా, ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ పాల్ పోగ్బా రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక మూడో స్థానాన్ని విరాట్ కోహ్లీ కైవసం చేసుకున్నాడు. 
 
ఇదే జాబితా టాప్-50లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కూడా స్థానం దక్కింది. వాణిజ్యపరమైన అంశాలతో పాటు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న స్పోర్ట్స్ ప్రో లిస్టులో.. టెన్నిస్‌ నెం.1 జకోవిచ్‌ 23వ ర్యాంకును, ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్ మెస్సీ 27వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాడు క్రికెటర్.. నేడు మంత్రి : రాజకీయ నేతగా మారిన మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా