Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోలుకున్న హర్యానా హరికేన్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

కోలుకున్న హర్యానా హరికేన్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
, ఆదివారం, 25 అక్టోబరు 2020 (17:38 IST)
ఇటీవల ఛాతినొప్పికి గురైన హర్యానా హరికేన్, భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తిరిగి కోలుకున్నారు. దీంతో ఆయన్ను ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ చేశారు. 
 
భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి, దేశానికి తొలి క్రికెట్ ప్రపంచ కప్‌ను అందించిన క్రికెట్ హీరో అయిన కపిల్ దేవ్‌కు ఇటీవల గుండెపోటు వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో ఆయనను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కపిల్ కోలుకున్నారని, డిశ్చార్జ్ అయ్యారని మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను పోస్ట్ చేశారు.
 
కాగా, ఇటీవల ఆసుపత్రిలో కపిల్‌ తన కూతురు ఆమ్యాతో కలిసి దిగిన ఫొటోను కూడా ఆయనే పోస్టు చేసిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జ్ అయినట్లు చేతన్‌ శర్మ తెలుపుతూ ఆయనకు యాంజియో ప్లాస్టీ సర్జరీ చేసిన డాక్టర్‌ అతుల్‌ మథుర్‌తో కలిసి దిగిన ఫొటోను చేతన్‌ ఆదివారం పోస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాష్‌రూంకు వెళ్లొచ్చేసరికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది.. సీఎస్కేను 'తలైవా' కూడా రక్షించలేడు...