Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించాలి : వసీం జాఫర్

భారత కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ శర్మకు  అప్పగించాలి : వసీం జాఫర్
, ఆదివారం, 14 జులై 2019 (17:22 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత భారత క్రికెట్ జట్టులోని లుకలుకలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో టీమిండియా పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. 
 
దీనిపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2023 వరల్డ్‌కప్ ఆడాలి. అటు ఈ వైఫల్యం వల్ల వన్డే కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగిస్తే బాగుంటుందా.? అనే ప్రశ్నను కూడా అభిమానులను అడిగాడు. ఏది ఏమైనా అతడు చేసిన ప్రశ్నకు ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కాగా, ఈ వరల్డ్ కప్‌లో భారత ప్రదర్శన అద్భుతంగా సాగింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ చేతిలో 18 రన్స్ తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ ఓటమితో టీమ్‌పై సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఒకవైపు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీని రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఫ్యాన్స్ అభ్యర్థిస్తుంటే.. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మకు టీమిండియా పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.
 
కాగా, ఈ టోర్నీలో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. లీగ్ మ్యాచ్‌లలో ఏకంగా ఐదు సెంచరీలు, ఒక అర్థ సెంచరీతో మొత్తం 648 పరుగులు చేశాడు. కానీ న్యూజిలాండ్‌తో సెమీస్ పోరులో మాత్రం అతడు ఒక్క పరుగుకే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అటు ఈ ఓటమి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ప్రభావం చూపడమే కాదు.. కోచ్ రవిశాస్త్రీ, కోహ్లీ మధ్య సఖ్యతలేమిని కూడా ఎత్తి చూపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటమికి కూడా సెలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి : బీసీసీఐ