Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్: షారూఖ్, గౌరీ ఖాన్, జూహ్లీ చావ్లాలకు షోకాజ్ నోటీసులు

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కింద నవెూదైన కేసులో ఐపీల్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓనర్ బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌కు ఎన్‌ఫోర్స్‌వెుంట్‌ డైరెక్టరేట్‌- ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది

ఐపీఎల్: షారూఖ్, గౌరీ ఖాన్, జూహ్లీ చావ్లాలకు షోకాజ్ నోటీసులు
, శనివారం, 25 మార్చి 2017 (09:42 IST)
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కింద నవెూదైన కేసులో ఐపీల్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓనర్ బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌కు ఎన్‌ఫోర్స్‌వెుంట్‌ డైరెక్టరేట్‌- ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫెమా ఉల్లంఘన కింద నమోదైన కేసులో షారూఖ్‌తో పాటు ఆయన సతీమణి గౌరీఖాన్, నైట్‌రైడర్స్‌ సహ యజమాని జూహీచావ్లా, నైట్‌ రైడర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఆర్‌ఎస్‌పీఎల్‌) కూడా నోటీసులు జారీ అయ్యాయి. 
 
కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ బాస్ అయిన కేఆర్‌ఎస్‌పీఎల్‌ షేర్లను మారిషస్‌కు చెందిన ఓ సంస్థకు అసలు ధర కంటే తక్కువ రేటుకు విక్రయించారని, అందులో 73.6 కోట్ల మేరకు నష్టం కలిగిందన్నది ఈడీ చెప్తోంది. తద్వారా ఫెమా రూల్స్ ఉల్లంఘించారనే కారణంతో నోటీసులు ఇచ్చినట్టు ఈడీ పేర్కొంది. దీనిపై 2008-09 లో కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఈడీ పంపిన నోటీసులు అందుకున్న తర్వాత 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాల్సి వుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

50 శాతం ఫిట్‌నెస్ ఉన్నా సరే కోహ్లీ ఆడాల్సిందే అంటున్న సునీల్ గవాస్కర్