Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ సీజన్ కోసం మినీ వేలం - రూ.13 కోట్లకు అమ్ముడైన ఇంగ్లండ్ క్రికెటర్

harry brook
, శుక్రవారం, 23 డిశెంబరు 2022 (15:58 IST)
వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం మినీ వేలం పాటలను శుక్రవారం నిర్వహించారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌లో జరిగిన ఈ వేలం పాటల్లో ఇంగ్లండ్ జట్టుకు సంచలన ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టు ఏకంగా రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే, మయాంక్ అగర్వాల్‌ను ఎస్ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది. 
 
గత కొంతకాలంగా హ్యారీ బ్రూక్ సెచరీల మోత మోగిస్తున్నాడు. దీంతో అతని కోసం వేలంలో గట్టిపోటీ ఏర్పడింది. చివరకు ఎస్ఆర్‌హెచ్ జట్టు 13.25 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అదేఊపులో భారత క్రికెట్ జట్టు జాతీయ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను కూడా కొనుగోలు చేసింది. 
 
ఇకపోతే, సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకోగా, అజింక్యా రహానేను రూ.50 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే, ఇంగ్లండ్ జట్టు స్టార్ ఆటగాడు జో రూట్‌, బంగ్లాదేశ్ నంబర్ వన్ ఆల్‌రౌండర్ షకీబులా హాసన్‌లను ఏ ఒక్క ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్‌లకు బీసీసీఐ ప్రమోషన్!