Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముగింపుకు చేరుకున్న ఐపీఎల్... ఈ నాలుగు జట్ల నుంచే విజేత!

ఈ సీజన్ ఐపీఎల్ ముగింపుకు చేరుకుంది. ఈ టోర్నీలో తొలి అంచె పోటీలు ముగిశాయి. క్వాలిఫయర్ దశలో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాదు, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పం

ముగింపుకు చేరుకున్న ఐపీఎల్... ఈ నాలుగు జట్ల నుంచే విజేత!
, మంగళవారం, 16 మే 2017 (10:01 IST)
ఈ సీజన్ ఐపీఎల్ ముగింపుకు చేరుకుంది. ఈ టోర్నీలో తొలి అంచె పోటీలు ముగిశాయి. క్వాలిఫయర్ దశలో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాదు, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, డిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ లయన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్, సన్ రైజర్స్ హైదరాబాదు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు మలిదశ పోటీలకు అర్హత సాధించాయి.
 
అయితే ఈ పోటీల్లో ముంబై ఇండియన్స్‌తో పాటు రైజింగ్ పూణే సూపర్ జెయింట్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇందులో విజేత నేరుగా ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. ఓటమిపాలైన జట్టు సన్ రైజర్స్ హైదరాబాదు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్యపోరులో విజయం సాధించిన జట్టుతో ఆడుతుంది. అనంతరం ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన జట్టు, తొలి మ్యాచ్‌లో పరాజిత, రెండో మ్యాచ్ విజేత జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఓటమిపాలైన జట్టుతో మూడో స్థానం కోసం ఆడుతుంది. అనంతరం చివరగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆదివారంతో 2017 ఐపీఎల్ సీజన్ ముగిసిపోనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీమ్ యాజమాన్యం చీత్కరించింది.. స్టేడియం సెల్యూట్ చేసింది.. దటీజ్ ధోనీ..