Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఓడింది.. కంటతడిపెట్టిన సచిన్ బేబీ.. ట్విట్టర్లో ప్రశంసలు..!

Advertiesment
ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఓడింది.. కంటతడిపెట్టిన సచిన్ బేబీ.. ట్విట్టర్లో ప్రశంసలు..!
, సోమవారం, 30 మే 2016 (18:51 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ నిర్దేశించిన 209 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించే క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభంలో మెరుగ్గా ఆడినా ఆపై తడబడింది. చివరకు ఓటమి అంచుల దాకా వెళ్ళి ప్రేక్షకుల్లో ఉత్కంఠను ఏర్పరిచింది. 
 
ఓటమి అంచుల్లో సచిన్ బేబీ రెండు బంతుల్లో 14 పరుగులు చేశాడు. అయినప్పటితీ తొలి బంతికి సింగిల్ రన్ మాత్రమే తీయగలిగిన సచిన్ తమ జట్టు ఓడిపోతున్నందుకు జీర్ణించుకోలేక కంటతడిపెట్టాడు. ఆ సమయంలో మ్యాచ్ చూసినవారిలో చాలామంది కూడా సచిన్ ఏడుపును చూసి ఏడ్చేశారు. 10 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 18 పరుగులు చేసిన సచిన్ బేబీ జట్టు ఓడిపోతున్న కారణంగా కన్నీళ్ళు పెట్టుకున్నందుకు ఫ్యాన్స్ బాధపడ్డారు. అంతేగాకుండా సచిన్ బాగా ఆడాడని ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ బెట్టింగ్.. కట్టుకున్న భార్యను తాకట్టు పెట్టిన కలియుగ ధర్మరాజు.. ఎక్కడ?!