Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోహ్లీ డబుల్ సెంచరీ.. రెహానే శతకం : భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 557/5 రన్స్

ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చెలరేగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది ప్రత్యర్ధికి చుక్కలు చూపించింది. 5 వికెట్లను కోల్పోయి 557 పరుగులు చేసి

కోహ్లీ డబుల్ సెంచరీ.. రెహానే శతకం : భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 557/5 రన్స్
, ఆదివారం, 9 అక్టోబరు 2016 (16:23 IST)
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చెలరేగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది ప్రత్యర్ధికి చుక్కలు చూపించింది. 5 వికెట్లను కోల్పోయి 557 పరుగులు చేసిన స్థితిలో కెప్టెన్ కోహ్లీ డిక్లేర్డ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. 
 
అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ(211), రహానేలు(188) భారీ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో రెండో రోజు ఆటలో 169 ఓవర్లు ముగిసే సమయానికి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసి టీమిండియా కివీస్‌ను బ్యాటింగ్‌కు దింపింది. మరో మూడు రోజులు ఆట మిగిలి ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.
 
ఈ ఇన్నింగ్స్‌లో 100 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన స్థితిలో విరాట్ కోహ్లీకి జతగా అజింక్య రహానే వచ్చిన తర్వాత మూడో టెస్టు రెండో రోజు ఆటే మారిపోయింది. విరాట్ కోహ్లీ, రహానేలు 150 పరుగుల మైలురాయిని దాటేసి జట్టు స్కోరును ముందుకు సాగించారు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీని దాటేశాడు. 
 
మొత్తం 347 బంతులాడిన కోహ్లీ 18 ఫోర్ల సాయంతో 200 పరుగులు చేసి.. తన వ్యక్తిగత స్కోరు 211 పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత రహానే కూడా 188 పరుగుల వద్ద ఔట్ కావడంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం జరిగింది. కివీస్ బౌలర్లలో జేఎస్ పటేల్‌కు 4 వికెట్లు దక్కగా, హెన్రీకి మూడు వికెట్లు లభించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోర్ టెస్ట్ : విరాట్ కోహ్లీ శతకం... భారత్ ఫస్ట్ డే స్కోరు 267/3