ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్కు తొలి టెస్ట్ మ్యాచ్లో ఘోర పరాజయం ఎదురైంది. ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా లీడ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ చిత్తు
గా ఓడిపోవడమేకాకుండా, ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
భారత్ నిర్ధేశించిన 371 పరుగులు విజయలక్ష్యాన్ని ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్లుకోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఒక టెస్ట్ మ్యాచ్లో ఐదు సెంచరీలు చేసి ఓటమిపాలైన తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్ళు ఐదు సెంచరీలు నమోదు చేశారు. రిషభ్ పంత్ (134, 118) రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేయగా, యశస్వి జైశ్వాల్ (101), శుభమన్ గిల్ (147), కేఎల్ రాహుల్ (137)లు శతకాలు చేశారు.
అంతకుముందు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 1928/29లో జరిగిన యాషెస్ మ్యాచ్లో నాలుగు సెంచరీలు చేసినప్పటికీ ఆ జట్టు ఓడిపోయింది. డాన్ బ్రాడ్మెన్ ఆ మ్యాచ్లో తొలి సెంచరీ చేశాడు.