Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోహి(ట్)త్ శర్మకు ఏమైంది.. ఇలా చేశాడు...

రోహి(ట్)త్ శర్మకు ఏమైంది.. ఇలా చేశాడు...
, మంగళవారం, 5 మార్చి 2019 (15:43 IST)
భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ తన సొంత గడ్డపై పూర్తిగా నిరాశపరిచాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో భారత్ రెండో వన్డే మ్యాచ్‌ను మంగళవారం నాగ్‌పూర్ వేదికగా ఆడుతోంది. ఇందులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు క్రీజ్‌లోకి వచ్చారు. అయితే, రోహిత్ శర్మ తొలి ఓవర్ ఆఖరు బంతికి డకౌట్ అయ్యాడు. తన కెరీర్‌లో అదీ సొంతగడ్డపై రోహిత్ ఇలా ఔట్ కావడం ఇదే తొలిసారి. దీంతో సొంతూరి క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
కాగా, ఆదివారం హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. ఈ ఉత్సాహంతోవున్న కోహ్లిసేన ఈ మ్యాచ్‌ను సైతం గెలిచి సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా భారత్‌ బరిలోకి దిగింది. ఇక ఆసీస్‌ రెండు మార్పులు చేసింది. టర్నర్‌, జాసన్‌ బెహెండ్రాఫ్‌లకు ఉద్వాసన పలికి షాన్‌ మార్ష్‌, నాథన్‌ లియోన్‌లకు అవకాశం కల్పించింది. తొలి వన్డేలో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
 
ఇపుడు రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ధావన్‌లు క్రీజ్‌లోకి వచ్చారు. తొలి ఆస్ట్రేలియా బౌలర్ కుమ్మిన్స్ వేసిన చివరి ప్యాట్ కుమ్మిన్స్ వేసిన ఆఖరి బంతికి రోహిత్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌ రూపంలో వచ్చిన ఆ బంతిని అప్పర్‌ కట్‌కు యత్నించిన రోహిత్‌.. ఆడమ్‌ జంపాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే భారత్‌ వికెట్‌ను కోల్పోయినట్లయ్యింది. మధ్యానం 3.30 గంటల సమయంలో భారత్ స్కోరు 31.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 167 పరుగలు చేసింది. క్రీజ్‌లో కెప్టెన్ కోహ్లీ (67), జాధవ్ (7)లు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వన్డే మ్యాచ్‌ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మంజ్రేకర్‌ను ట్రోల్ చేస్తున్న?