Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇద్దరు ఒకే అమ్మాయి కోసం పరుగెడుతారు..

ఇద్దరు ఒకే అమ్మాయి కోసం పరుగెడుతారు..
, మంగళవారం, 6 నవంబరు 2018 (11:49 IST)
ఈడెన్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బౌలర్లు చెలరేగడంతో వెస్టిండీస్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఛేదనలో ఆదిలో కొంచెం తడబడింది. ఆ తర్వాత కార్తీక్, కృనాల్‌లు రాణించడంతో రోహిత్ సేన సునాయాసంగా గెలిచింది. 
 
ఇక ఈ మ్యాచ్ గెలుపోటములు అటుంచితే… విండీస్ క్రికెటర్లు చేసిన ఓ పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది. అసలేం జరిగిందంటే… ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన నాల్గో ఓవర్‌లో కరేబియన్ ఆటగాళ్లు హెట్‌మైర్‌, హోప్ తడబడి రనౌట్ రూపంలో వికెట్ పారేసుకున్నారు. హెట్‌మైర్‌తో కోఆర్డినేషన్ సరిగా లేకపోవడంతో  షై హోప్‌ రనౌటయ్యాడు.
 
ఈ రనౌట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డ్యూట్ ఇది క్రికెట్ బాస్.. రన్నింగ్ రేస్ కాదూ, ఎందుకు ఇద్దరు ఒకే అమ్మాయి కోసం పరుగెడుతారు, బీజేపీ అండ్ కాంగ్రెస్ రేస్, హెట్‌మైర్‌ విన్ ది రేస్ అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అజారుద్ధీన్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు.. బెల్‌ను మోగించడం ఏంటి?